Monday, 2 November 2015

 http://telugu.v6news.tv/img/2015/11/gun1.jpg





గొలుసు దొంగతనాలతో నగరవాసులకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్న చైన్ స్నాచర్లకు తమదైన శైలిలో బుద్ధి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే యాంటి చైన్ స్నాచింగ్ టీమ్ ఏర్పాటు చేసిన పోలీసులు.. తాజాగా సిటీలో తమ ఉనికిని చాటారు. హైదరాబాద్ వనస్థలిపురం దగ్గరలోని ఆటోనగర్ లో చైన్ స్నాచింగ్ కు ప్రయత్నించిన దొంగలపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. స్థానిక రాజధాని హోటల్ దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది. పెట్రోల్ బంక్ లో పని చేస్తున్న యువతి నుంచి స్నాచింగ్స్ కు పాల్పడుతుండగా.. గుర్తించిన ప్రత్యేక బృందం పోలీసులు కాల్పులు జరిపారు. తూటాల నుంచి తప్పించుకున్న దొంగలు పరారయ్యారు. కాల్పులతో జనం షాక్ అయ్యారు. ఏం జరుగుతుందో అర్థంకాక పరుగులు తీశారు. దొంగల కోసం వేట మొదలుపెట్టారు ఖాకీలు.

No comments:

Post a Comment